అభివృద్ధి మీ కళ్ల ముందే ఉంది...

19 Nov, 2023 00:16 IST|Sakshi
● ప్రజలు విజ్ఞతతో ఓటు వేయండి ● బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మంలో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తోందని.. ఓటర్లు విజ్ఞతతో అన్ని విషయాలను ఆలోచించి తనను మరోమారు గెలిపించాలని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరారు. ఖమ్మంలోని పలు డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేసిన ఆయన రోడ్‌ షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడకు పలుచోట్ల మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ వాళ్లు అనేక మాటలు చెబుతుండగా, తప్పుడు హామీలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మంను అన్నిరంగాల్లో తీర్చిదిద్దిన తనను ప్రజలు మరోమారు గెలిపిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ఖమ్మం ఇప్పటికే అన్ని రంగాల్లో ముందు నిలవగా... మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తానని పువ్వాడ వెల్లడించారు.కాగా, కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలో ఖమ్మంకు ఏం చేశారో చెప్పడానికి ఒక్క పని లేదని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు