మెదక్ మున్సిపాలిటీ: ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పోలీస్ పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను, ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన వైపీఆర్ కళాశాలను సందర్శించారు. ఆయనకు ఏర్పాట్ల వివరాలను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వివరించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు భద్రతాపరమైన అంశాలకు తీసుకుంటున్న చర్యలు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ఫణీంద్ర, మెదక్ పట్టణ సీఐ వెంకట్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, హవేలిఘనపూర్ ఎస్ఐ ఆనంద్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.