ఆటతో... 

23 Sep, 2023 00:49 IST|Sakshi

చైతన్య పసుపులేటి, హీనా రాయ్‌ జంటగా నటించిన చిత్రం ‘జీటీఏ’. దీపక్‌ సిద్ధాంత్‌ దర్శకత్వంలో డా. సుశీల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 6న విడుదల కానుంది.

ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య రిలీజ్‌  చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా హిట్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘క్రైమ్‌ యాక్షన్‌ డ్రామాగా జీటీఏ అనే ఆట ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు దీపక్‌ సిద్ధాంత్‌. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె. రాబిన్, కామెరా: కేవీ ప్రసాద్‌. 

మరిన్ని వార్తలు