అజిత్‌.. వలిమై తర్వాతేంటి..? 

20 Aug, 2021 08:06 IST|Sakshi

తమిళసినిమా: హీరో అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం వలిమై. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ తుది ఘట్టానికి చేరుకుంది. దీంతో అజిత్‌ నటించనున్న నెక్ట్స్‌ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కాగా బోనీ కపూర్‌కి మరో అవకాశం ఇస్తున్నట్లు తాజా సమాచారం. ఇక గతంలో నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలలో అజిత్‌ నటించారు. ఈ రెండింటికీ హెచ్‌.వినోద్‌నే దర్శకుడిగా ఎంచుకున్నారు.  తదుపరి చిత్రా నికి కూడా ఈయనే దర్శక త్వం వహించనున్నారు. నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలకు యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు. కాగా అజిత్‌ తాజా చిత్రానికి జిబ్రాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు తెలిసింది.  
 

మరిన్ని వార్తలు