సాక్షి, హైదరాబాద్: తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర బీజేపీ మంగళవారం 4 రాష్ట్రాలకు ఇన్చార్జులను నియమించింది. తమిళనాడుతోపాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలకు కూడా ఎన్నికల ఇన్చార్జుల నియామకం చేపట్టింది.