ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ రోడ్రిగ్స్‌ కన్నుమూత

5 Mar, 2022 06:24 IST|Sakshi

న్యూఢిల్లీ/పనాజీ: భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ సునీత్‌ ఫ్రాన్సిస్‌ రోడ్రిగ్స్‌(88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని పనాజీలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించినట్లు భారత సైన్యం ట్విట్టర్‌లో తెలియజేసింది.  జనరల్‌ రోడ్రిగ్స్‌ 1990 నుంచి 1993 వరకు భారత సైనికాధిపతిగా పనిచేశారు. 2004 నుంచి 2010 దాకా పంజాబ్‌ గవర్నర్‌గా సేవలందించారు. రోడ్రిగ్స్‌ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు