భర్త చేసినా అత్యాచారమే

19 Dec, 2023 05:27 IST|Sakshi
న్యాయమూర్తి జస్టిస్‌ దివ్యేశ్‌ జోషి

అహ్మదాబాద్‌: ‘అత్యాచారం ఎవరు చేసినా అత్యాచారమే. భర్త అత్యాచారానికి పాల్పడినా అది నేరమే’ అని గుజరాత్‌ హైకోర్టు పేర్కొంది. మహిళలపై లైంగిక హింస పట్ల నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన అవసరముందని న్యాయమూర్తి జస్టిస్‌ దివ్యేశ్‌ జోషి అన్నారు. ఓ మహిళ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కోడలి పట్ల క్రూరత్వం, నేరపూరిత ప్రవర్తన కారణంగా పిటిషనర్‌కు బెయిలిచ్చేందుకు నిరాకరించారు. భర్త, కొడుకు కలిసి కోడలిపై అత్యాచారం చేస్తూ వాటిని వీడియోలు తీసి పోర్నోగ్రఫీ సైట్లలో పెట్టి డబ్బు సంపాదిస్తున్నారని తెలిసినా ఆమె మిన్నకుండిపోవడంపై జడ్జి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు