జ్ఞానవాపి కేసు: ముస్లిం సంఘాలకు చుక్కెదురు

19 Dec, 2023 10:53 IST|Sakshi

ఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌పై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది.

ఈ మేరకు మంగళవారం అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్‌ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

>
మరిన్ని వార్తలు