-

Purvanchal Expressway: విమానాలకు రన్‌వేగా..

11 Nov, 2021 07:53 IST|Sakshi

లక్నో: దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని భారత ప్రధాని నరేంద్రమోది నవంబర్ 16న ప్రారంభించనున్నారు. పైగా లక్నోలోని చాంద్ సరాయ్‌లో మొదలుకొని ఈ ఎక్స్‌ప్రెస్‌వే  340 కిలోమీటర్ల పొడవుతో ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది. అంతేకాదు ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్‌పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితరప్రాంతాలను కలుపుతూ వెళుతుంది.

(చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్‌)

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి  ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే భారత వైమానిక దళానికి చెందిన విమానాలకు అత్యవసర రన్‌వేగా కూడా ఉపయోగించటమే కాక అత్యవసర పరిస్థితుల్లో ఐఏఎఫ్‌కి చెందిన ఫైటర్ జెట్‌లకు కూడా ఎయిర్‌స్ట్రిప్‌( అత్యవసర ల్యాండింగ్ కోసం తాత్కాలిక స్టేషన్)గా కూడా ఉపయోగడనుంది.

(చదవండి: కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంతో పని లేదు)

మరిన్ని వార్తలు