-

వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి

28 Nov, 2023 06:28 IST|Sakshi

భువనేశ్వర్‌: రూర్కెలా–పూరి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

మెరామండలి, బుద్ధపంక్‌ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది.

మరిన్ని వార్తలు