పాక్‌ చొరబాటుదారుల కాల్చివేత..డ్రగ్స్‌ స్వాధీనం

3 May, 2023 07:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దులు దాటి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరిని కాల్చివేసి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. రాజస్తాన్‌లోని బార్మేర్‌ వద్ద పాక్‌ సరిహద్దులవెంట సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వారినుంచి మూడు ప్యాకెట్లలో హెరాయిన్‌ దొరికిందని బీఎస్‌ఎఫ్‌ ప్రతినిధి తెలిపారు. తెలిపింది. వారిద్దరినీ డ్రగ్స్‌ స్మగ్లర్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. 

(చదవండి: మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప..)

మరిన్ని వార్తలు