ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

1 May, 2023 05:58 IST|Sakshi

కాళేశ్వరం: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా బాంబ్రాగాడ్‌ తాలూకా దామరంచ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్‌ తెలిపారు.

పెరిమిలి, అహేరి మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయనే సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా జరిఎదురు కాల్పుల్లో పెరిమిలి దళం కమాండర్‌ బిట్లు మడావి, వాసు, అహేరి దళానికి చెందిన శ్రీకాంత్‌ మృతి చెందారు.

మరిన్ని వార్తలు