డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పౌరిలోని థాలిసైన్ పట్ట్టణం నుంచి డెహ్రాడూన్కు తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈఘటనలో మంత్రికి స్వల్పగాయలవ్వగా, ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
చదవండి: ఇండియాలో అత్యధిక రెంట్ వచ్చేది ఎక్కడో తెలుసా?
కాగా మంత్రి తన సిబ్బందితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుది. ఘటనా స్థలంలో తీసిన పై ఫోటోలో.. ప్రమాదం జరిగిన తర్వాత ఒక కారు బోల్తా పడగా, మరొకటి దాని పక్కనే ఆగి ఉన్నట్లు కనిపిస్తోంది.
చదవండి: షాకింగ్: బార్లో సీక్రెట్ రూమ్.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు..