‘కుప్పంలో ఓటమిని డైవర్ట్‌ చేయడానికే చంద్రబాబు డ్రామాలు’

5 Jan, 2023 16:32 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు పిచ్చివాడిలా ప్రవర్తిసున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం చనిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మీటింగ్‌లు పెట్టి జనాన్ని తరలిస్తున్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సభలను కట్టడి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కుప్పంలో ఓటమిని డైవర్ట్‌ చేయడానికే బాబు డ్రామాలు’’ అంటూ ధ్వజమెత్తారు.

‘‘ జీవో నంబర్ 1 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. ఆ జీవో వెనుక ఉన్న నేపథ్యం ఏంటీ?. అధికార దాహం కోసం చంద్రబాబు చేస్తోంది ఏంటీ?. కందుకూరు ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. గుంటూరులో మరో ముగ్గురు మరణించారు. సరైన ఏర్పాట్లు చేసుకోలేక పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మీటింగ్‌లు పెడుతున్నారు. వారి మరణాలకు కారణం అవుతున్నారు’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.
చదవండి: దేశంలోనే అతిపెద్ద పొలిటికల్‌ సైకో చంద్రబాబు: మంత్రి ఆర్కే రోజా

మరిన్ని వార్తలు