జనసేన టీడీపీ పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా.. చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటివారిని వైఎస్సార్సీపీ కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే వెళ్లిపోవచ్చు..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ప్రకటన ఇది. పదేళ్లుగా నమ్ముకున్న పార్టీ నేతల్ని, కార్యకర్తల మనోభావాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కుతూ పక్క పార్టీ జెండా మోయాలంటూ నిసిగ్గుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మేధావులు, నేతలు, సాధారణ పౌరులు.. ఆఖరికి జనసేన అసంతృప్తులు సంధిస్తున్న ప్రశ్నలకు పవన్ దగ్గర సమాధానాలు ఉన్నాయంటారా?
కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో, పవన్ కల్యాణ్కో తూట్లు పొడిచినట్లు కాదు. ఏ ప్రజల కోసం నిలబడాలనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నట్లు. అందుకే అలాంటి చర్యలను సహించను!
దశాబ్ద కాలంపాటు ఎవరున్నా లేకపోయినా పార్టీని నడిపిన వ్యక్తి.. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి జరిగేలా, రాష్ట్రానికి మేలు చేసేలా, తెలుగు ప్రజలకు అండగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాడని సంపూర్ణంగా నమ్మితే మీరు సందేహించరు. గొడవలు పెట్టుకోరు.
నన్ను ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకుంటారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోరు. ఎక్కడుంది లోపం? జాతీయ స్థాయిలో నాకు ఉన్న దృష్టి, మనవాళ్లకు ఎందుకు అర్థం కాదు? మోదీ అంతటి వ్యక్తి అర్థం చేసుకుంటే ఇక్కడి కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఎందుకు ఉంటారు? నా నిర్ణయాలను సందేహించేవారు వెళ్లిపోవచ్చు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సీరియస్గా తీసుకుంటాను. తెదేపాను తగ్గించేలా మన నాయకులు ఎవరూ మాట్లాడినా సహించేది లేదు. నేను మొండి వ్యక్తిని, భావజాలాన్ని నమ్మినవాణ్ని. రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ బతిమాలరు.
పొత్తు వెనుక వ్యూహాలు ఉంటాయి. టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు. టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది. నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు. నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది. కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.!
పైగా అవివేకంతోనో.. అజ్ఞానంతోనో తాను ఈ నిర్ణయం తీసుకోలేదు