ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు

20 May, 2021 05:07 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి

ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌ సీపీలో చేరిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు

సాక్షి, విశాఖపట్నం: ప్రజాసమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నాడని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన బుధవారం విశాఖ తిమ్మాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారికి పార్టీ కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న కుట్రల బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు మొహం చాటేశారని విమర్శించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు పోతుంటే.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు వికృతానందం పొందుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రజల ప్రాణాలపై కూడా రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.   

మరిన్ని వార్తలు