T20 WC: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ బోణీ.. ఐర్లాండ్‌పై ఘన విజయం

16 Feb, 2023 08:20 IST|Sakshi

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 95 పరుగులకే కుప్పకూలింది.

పాక్‌ బౌలర్లలో నష్రా సంధు ఐర్లాండ్‌ను పతనాన్ని శాసించగా.. నిదా ధార్‌, ఇక్భాల్‌ చెరో రెండు వికెట్లు, ఫాతిమా సానా, హసన్‌ తలా వికెట్‌ సాధించారు. ఐర్లాండ్‌ బ్యాటర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 31 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 
సెంచరీతో చెలరేగిన మునీబా అలీ
ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ మునీబా అలీ అద్భుతమైన సెంచరీ సాధించింది. 68 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగులు చేసింది.

కాగా టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్‌ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇక మునీబాతో పాటు ధార్‌ కూడా 33 పరుగుల తేడాతో రాణించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో అర్లీన్ కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. పాల్‌, డెన్లీ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: Smriti Mandana: వచ్చీ రావడంతో స్టన్నింగ్‌ క్యాచ్‌తో..

>
మరిన్ని వార్తలు