వరల్డ్‌కప్‌లో ఆ జట్టుతో జాగ్రత్త.. టీమిండియా కూడా ఫేవరేట్‌: పీటర్సన్‌

20 Sep, 2023 11:36 IST|Sakshi

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-3 తేడాతో దక్షిణాఫ్రికా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ప్రోటీస్‌ ఓటమి పాలైనప్పటికీ.. ఆఖరి మూడు వన్డేల్లో మాత్రం దుమ్ము రేపింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే ప్రపంచకప్‌-2023 టైటిల్‌ రేసులో దక్షిణాఫ్రికా కచ్చితంగా ఉంటుందని పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు.

అదే విధంగా ఆసీస్‌తో నాలుగో వన్డేల్లో మెరుపు సెంచరీ సాధించిన హెన్రిస్‌ క్లాసెన్‌ను కూడా పీటర్సన్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. "ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా అద్బుతమైన సిరీస్‌ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్‌ టైటిల్‌ ఫేవరేట్‌గా ప్రోటీస్‌ జట్టు మారిపోయింది. క్లాసెన్‌ వారికి ప్రధాన ఆస్తి. అతడు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగలడు.

అయితే ఆసియాకప్‌ను కైసవం చేసుకున్న భారత జట్టు కూడా టైటిల్‌ బరిలో ఉంటుంది. అదే విధంగా వారి స్వదేశంలో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు పాకిస్తాన్‌ నుంచి కూడా మిగితా జట్లకు ముప్పు పొంచి ఉంది. ఫేవరెట్ ట్యాగ్ పరంగా చూస్తే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు భారత్‌ తర్వాతే ఉంటాయని" ట్విటర్‌(ఎక్స్‌)లో పీటర్సన్‌ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో ఆక్టోబర్‌ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.
చదవండి: #Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్‌ షమీకి బిగ్‌ రిలీఫ్‌.. బెయిల్‌ మంజూరు

మరిన్ని వార్తలు