Tokyo Paralympics: భవీనాబెన్‌ పటేల్‌కు రజతం

29 Aug, 2021 08:07 IST|Sakshi

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్లో ఓడిన భవీనాబెన్‌ పటేల్‌ రజతం గెలిచింది. ఫైనల్లో నంబర్‌వన్‌..  చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. అయితే పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి. పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భవీనాబెన్‌ పటేల్‌ను అభినందించారు. చదవండి: సీజన్‌లో తొలి టైటిల్‌కు విజయం దూరంలో...

గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్‌ పీపుల్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్‌ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్‌ లలన్‌ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్‌ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. చదవండి: మూడో టెస్టులో టీమిండియా పరాభవం

మరిన్ని వార్తలు