WBBL: ఇటు జెమీమా.. అటు స్మృతి మంధాన.. అదరగొట్టేశారు.. అయితే..

28 Oct, 2021 08:59 IST|Sakshi

Jemimah Rodrigues Smriti Mandhana Hit Fifties: మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన అదరగొట్టారు. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ తరఫున జెమీమా... సిడ్నీ థండర్‌ జట్టు తరఫున స్మృతి మంధాన బరిలోకి దిగారు. ఈ రెండు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టు తొమ్మిది పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత మెల్‌బోర్న్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు సాధించింది.

ఓపెనర్‌ జెమీమా 56 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మెల్‌బోర్న్‌ జట్టుకే ఆడుతున్న భారత వన్డే జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మూడు పరుగులు చేసి అవుటైంది. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్‌ స్మృతి మంధాన 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 64 పరుగులు చేసి హర్మన్‌ప్రీత్‌ బౌలింగ్‌లో బౌల్డయి పెవిలియన్‌ చేరింది. 

చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్‌ చరిత్రలో క్రేజీ ఓవర్‌ అంటున్న ఫ్యాన్స్‌!

మరిన్ని వార్తలు