సాక్షి,చైన్నె: ఆన్లైన్ వర్తకంలో పెట్టుబడుల పేరిట మోసానికి పాల్పడిన పోలీసు బ్రదర్స్ను సస్పెండ్ చేస్తూ కాంచీపురం ఎస్పీ సుధాకర్ మంగళవారం ఆదేశించారు. వివరాలు.. కాంచీపురానికి చెందిన పోలీసు బ్రదర్స్ ఆరోగ్య అరుణ్, సహాయ భారత్, వీరి మరో సోదరు డు, విద్యాశాఖ అధికారి ఇదయరాజ్తోపాటు కుటుంబం అంతా ఆన్లైన్ వర్తకంలో పెట్టుబడుల పేరిట రూ. 40 కోట్ల మేరకు వసూలు చేసింది.
ఈ క్రమంలో కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడిన వ్యవహారం ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కుటుంబంలోని 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారాన్ని కాంచీపురం ఎస్పీ సుధాకర్ తీవ్రంగా పరిగణించారు. ఆ పోలీస్ బ్రదర్స్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.