బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ అవయవ దానం

20 Sep, 2023 21:06 IST|Sakshi

వేలూరు: రాణిపేట జిల్లా సిప్‌కాడు సమీపంలోని తగరకుప్పం గ్రామానికి చెందిన రాబర్ట్‌ భార్య జభకుమారి(33). ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడున్నారు. దంపతులిద్దరూ సిప్‌కాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబర్ట్‌, జభకుమారి నాలుగు రోజుల క్రితం కంపెనీలో పని పూర్తి చేసుకొని బైకుపై ఇంటికి బయలు దేరారు. పొన్నై క్రాస్‌ రోడ్డులోని అనకట్టు చర్చి వద్ద వస్తున్న సమయంలో జభకుమారి ప్రమాదవశాత్తూ బైకు నుంచి కింద పడింది.

ఆ సమయంలో జభకుమారి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆమెను రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో జభకుమారికి సోమవారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌ అయ్యింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వ చ్చారు. దీంతో ఆమె అవయవాలను రాణిపేటలోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సిప్‌కాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు