అలంపూర్–పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోస్తాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
కృష్ణా జలాల అన్యాయాన్ని సవరించాలని కేంద్రానికి వినతి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణానదిపై పోతిరెడ్డి పాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే... తెలంగాణ ప్రభుత్వం కూడా అలం పూర్ –పెద్ద మరూర్ వద్ద (జూరాల దిగువన... శ్రీశైలం ఫోర్షోర్లో తుంగభద్ర కలవడానికి ముందు) బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయ మని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చు కోకుండా, మొండి వైఖరితో అక్రమ ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే... మహా రాష్ట్ర గోదావరి నదిపై శ్రీరాంసాగర్కు ఎగువన నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగానే తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం కృష్ణాపై కొత్త బ్యారేజీ నిర్మించి నీటిని ఎత్తిపోస్తామని హెచ్చ రించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా, ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవ హరిస్తే ఇక కుదరదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
‘నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. భారత యూనియన్లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీజలాల్లో న్యాయ మైన వాటాను పొందే హక్కు ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగు నీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతాం’అని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ పలుమార్లు అభ్యంత రాలు వ్యక్తం చేసినా, ఈ దిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులు, వాటాలపై వివరించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు.
అపెక్స్లో కేసీఆర్ వాదన ఇదీ...
ట్రిబ్యునల్ ఏర్పాటుపై హర్షం..
ఇక ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న సెక్షన్–3 కింద ఇచ్చిన వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందించడం, రాష్ట్ర ఒత్తిడి మేరకు ట్రిబ్యునల్ ద్వారా దీన్ని పరిష్కరిస్తామన్న హామీ ఇవ్వడం తెలంగాణకు మేలు చేకూర్చే అంశమన్నారు. తెలంగాణ ఫిర్యాదులు ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారమైతే కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వాదనను గట్టిగా వినిపించేందుకు కృషి చేసిన అధికారులందరినీ ముఖ్యమంత్రి అభినందించారు.