మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత

23 Apr, 2021 08:58 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ  జెడ్పీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన స్వగ్రామం జూపాకలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చదవండి: కోవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 13 మంది మృతి 
అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా?

మరిన్ని వార్తలు