పోలీసుల అడ్డగింత.. వైఎస్‌ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

28 Mar, 2023 12:40 IST|Sakshi
పోలీసులతో వాగ్వాదం.. తోపులాటలో కిందపడిపోయిన వైఎస్‌ షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఇంటివద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. 

అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా షర్మిలను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు యత్నించిన వైఎస్‌ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా, ఆమె కిందపడినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు