సాక్షి, హైదరాబాద్: పండగల సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. చార్జీల్లో రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 17నుంచి 31 వరకు పలు ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్లు బతుకమ్మ నుంచి సంక్రాంతి వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయన్నారు. ఇక నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో.. వర్షాలకు సిటీలో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయన్న ఆయన, ముసాపేట్ మెట్రో పిల్లర్కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తింపు
మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో ఈ నెల 31 వరకు 40 శాతం రాయితీ
టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు