Nizamabad: ఛార్జింగ్‌లో పేలిన ఈ-బైక్‌ బ్యాటరీ.. ఒకరి దుర్మరణం

20 Apr, 2022 16:27 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. నిజామాబాద్‌ టౌన్‌ సుభాష్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ చార్జింగ్‌ పెట్టి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు