Munawar Faruqui Comedy Show: ప్రోగ్రామ్‌ 5 గంటలకే ప్రారంభం.. నో సెల్‌ ఫోన్స్‌

20 Aug, 2022 16:32 IST|Sakshi

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్‌ చేసింది. మునవార్‌ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫారూఖీ షోను అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. షో విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మునావర్‌ కామెడీ షోను నిర్వాహకులు శనివారం సాయంత్రం 5 గంటలకే శిల్పకళా వేదికలో ప్రారంభించారు. కాగా, శిల్పకళా వేదిక గేట్లు సాయంత్రం 4:45కే మూసివేశారు. అలాగే, మునావర్‌ షోకు వచ్చే వారు షో టికెట్‌తో పాటుగా తమ వెంట ఆధార్‌ కార్డును కూడా తీసుకు రావాలని సూచించారు. కాగా, షోకు ఆహార పదార్ధాలు, వాటర్‌ బాటిల్స్‌, సెల్‌ ఫోన్స్‌ అనుమతిని నిరాకరించారు. ఇక, శిల్పకళా వేదిక వద్ద పోలీసులతో కొందరు వాదనకు దిగడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో చలాన్ల బాదుడు.. వామ్మె ఇన్ని వేల కోట్లా?

మరిన్ని వార్తలు