CM KCR Phone To Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌

27 Jan, 2022 12:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్లో పరామర్శించారు. చిరంజీవికి కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య వివరాలను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అంటూ ఆకాంక్షించారు. కాగా రెండు రోజుల క్రితం చిరంజీవి క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే.. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు.

‘‘కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ.. వైరస్‌ సోకింది. నిన్న రాత్రి తేలికపాటి లక్షణాలతో కనిపించడంతో.. కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. త్వరలోనే మీ అందరిని తిరిగి కలుస్తా’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు