వరంగల్‌లో గవర్నర్, హైదరాబాద్‌లో సీఎం

12 Mar, 2021 01:58 IST|Sakshi

నేడు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో కేంద్రం తలపెట్టిన ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్, వరంగల్‌ పోలీసు గ్రౌండ్స్‌లో గవర్నర్‌ తమిళిసై ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు జాతీయ జెండావిష్కరణ, పోలీసు కవాతుతో పాటు దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు