Telangana: 605 మందికి కరోనా 

11 Aug, 2022 02:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 605 మందికి కోవిడ్‌ నిర్ధారణయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,27,383 మందికి కరోనా సోకగా.. 8,18,552 మంది కోలుకున్నారు. మరో 4720 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్‌ ప్రభావంతో 4,111 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 38,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 532 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

మరిన్ని వార్తలు