స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

29 Mar, 2023 01:22 IST|Sakshi

రాయచోటిటౌన్‌ : రాయచోటిలో కొలువైన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం స్వామి విగ్రహ పాదాలను సూర్యకిరణాలు తాకాయి. కిరణాలు స్వామి వారి ఆలయ ముఖ ద్వారం ద్వారా నేరుగా గర్భగుడిలోని స్వామి వారి పాదాలను స్పృశిస్తూ నాభి వరకు వెళ్లాయి. సుమారు పదిహేను సెకన్ల పాటు స్వామి వారి పాదాలను తాకాయి. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆలయ పాలక మండలి అధ్యక్షురాలు పోలంరెడ్డి విజయ, ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంచి పెట్టారు.

మరిన్ని వార్తలు