కడప అర్బన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో కడప నగరంలోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని అశోక్నగర్కు చెందిన మణికంఠ(27)కు ఆరు సంవత్సరాల క్రిందట వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. భార్య తనను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసగా మారాడు. జీవితంపై విరక్తి చెంది.. ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
రుణదాతల ఒత్తిడితో..
కడప టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని మోచంపేటకు చెందిన షేక్ యూనస్బాషా (46) ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షేక్ యూనస్బాషాకు, కరీమున్నీసాకు కొన్నేళ్ల క్రిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2019లో ఉపాధి కోసం యానస్బాషా ఖత్తర్కు వెళ్లాడు. అప్పుడు అప్పు చేసి వెళ్లాడు. 2021లో తిరిగి కడపకు వచ్చేశాడు. అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువైంది. ఈక్రమంలో కారు డ్రైవర్గా వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. తాను విధులకు వెళ్లిన సమయంలో.. తన భార్య కరీమున్నీసా తన పిల్లలు నకాష్వీధిలోని తన సోదరి ఇంటికి వెళ్లేది. ఈక్రమంలో ఈ నెల 11న కారు డ్రైవర్గా వెళ్లిన యూనస్బాషా, తిరిగి ఈనెల 12న వచ్చాడు. తన భార్య, పిల్లలను అక్కడే వుండాలని.. తాను తిరిగి మరలా నకాష్కే వస్తానని చెప్పి ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
నిప్పంటించుకుని..
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని శ్రీశ్రీనగర్ కాలనీలో సోమవారం ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాల మేరకు.. శ్రీశ్రీనగర్ కాలనీకి చెందిన బొల్లెపు విజయలక్ష్మి(52)కి కుమార్తె కుమారుడు కలరు. కుమార్తెకు వివాహం చేసింది. కుమారుడు సింహాద్రిపురం మండలంలో వ్యవసాయ చేసుకుంటున్నాడు. బొల్లెపు విజయలక్ష్మీ భర్త బొల్లెపు క్రిష్ణారెడ్డి పదేశ్లు కిందటే మృతి చెందాడు. ఇంటిలో ఒంటరి ఉన్న ఆమె నిప్పంటించుకుని కాల్చుకుంది. మంటలు వ్యాప్తి చెందడంతో స్థానికులు ఇంటిలోకి వెళ్లి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తిగా కాలిపోయి మృతి చెందినది. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.