అవ్వ బదులు పనికి వెళ్లి.. | Sakshi
Sakshi News home page

అవ్వ బదులు పనికి వెళ్లి..

Published Tue, Nov 14 2023 1:22 AM

మృతి చెందిన శ్రీనివాసులు - Sakshi

రాజంపేట : మున్సిపాలిటీలో అవ్వకు బదులుగా పారిశుధ్య పనులు చేసేందుకు వెళ్లిన మనవడు మరణించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న గుర్ర నాగమ్మ అనారోగ్యంగా ఉండటంతో.. నిద్రపోతున్న మనవడు శ్రీనివాసులు(16)ను లేపి, తనకు బదులుగా పనికి వెళ్లాలని పంపించింది. నూనివారిపల్లెలో కాంపాక్ట్‌ వాహనం వద్ద పనులలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద కరెంటు షాక్‌ తగిలింది. ఈ సంఘటనలో దుర్మరణం చెందాడు. తన కోసం పనికి వెళ్లిన మనవుడు లేడన్న సమాచారంతో అవ్వ కుప్పకూలిపోయింది. నేను పోయినా బాగుండేది మనవడా అంటూ బోరున విలిపించింది.

మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

ప్రాంతీయ వైద్యశాలలో మృతదేహాన్ని జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి, చైర్మన్‌ పోలా సందర్శించి సంబంధీకులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జెడ్పీ చైర్మన్‌ ఫోన్‌ ద్వారా విషయం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మృతదేహాన్ని సీఐ నరసింహారావు పరిశీలించారు.

కరెంట్‌ షాక్‌ తగిలి మృత్యువాత

Advertisement
Advertisement