సైబరాబాద్‌ కమిషనర్ ఆనంద్‌పై హైకోర్టుకు ఫిర్యాదు

23 Dec, 2013 15:32 IST|Sakshi
సైబరాబాద్‌ కమిషనర్ ఆనంద్‌పై హైకోర్టుకు ఫిర్యాదు

హైదరాబాద్: సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌పై ఓ మహిళ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆనంద్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కమల కుమారి అనే మహిళ కోర్టుకు తెలిపారు.  కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఆయన పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీవీ ఆనంద్‌ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరయ్యేలా ఆదేశించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు.

మరిన్ని వార్తలు