భూ సమీకరణపై అభ్యంతరాలకు గడువు పెంచాలి

1 Feb, 2015 23:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూ సమీకరణపై అభ్యంతరాలు తెలిపే గడువు మరో వారం పొడిగించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ)కు రైతు సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. తుది గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో రైతు సంఘాల సమాఖ్య కన్వీనర్ ఎం.శేషగిరిరావు ఆదివారం సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు లేఖ రాశారు.

ఇంకా కొన్ని వేల మంది రైతులు భూ సమీకరణపై అభ్యంతరాలు తెలిపే ఫారం 9.2ను సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు వెళ్లిన రైతుల పట్ల అధికారుల ప్రవర్తన సరిగా లేదని, మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు