సరాయ్‌రోహిల్లాలో ఇరువురి హత్య | Sakshi
Sakshi News home page

సరాయ్‌రోహిల్లాలో ఇరువురి హత్య

Published Sun, Feb 1 2015 11:29 PM

Two killed in  Sarai Rohilla

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా తనతో సహజీవనం చేస్తోన్న ఓ మహిళను, ఆమె కుమారుడ్ని కూడా ఓ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ఢిల్లీలోని సరాయ్ రోహిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తాను వెళ్లేసరికి రుక్సానా(25), ఫిరోజ్(4) చనిపోయారని పోలీసులకు ఆమె సోదరి నవీష తెలిపింది. కాగా, రుక్సానాకు నాలుగేళ్ల కిందటే వివాహమవ్వగా, ఆమె భర్త మరొకామెను పెళ్లి చేసుకుని నేపాల్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఆమె బిహార్ నుంచి వచ్చి ఢిల్లీలో నివసిస్తోంది. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సల్మాన్ ఢిల్లీలోని ఓ  పరిశ్రమలో ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరి మధ్య ఐదు నెలల కిందట స్నేహం చిగురించి, సహజీవనానికి దారి తీసింది. అయితే మూడు నెలలుగా వీరిద్దరూ కలిసి సరాయ రోహిల్లా ప్రాంతంలో ఉంటున్నారు. వీరు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉండేవారని, అయితే శనివారం రాత్రి అది తారస్థాయికి చేరింది. చుట్టుపక్కల వారు కల్పించుకోవడంతో సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత ఏమయిందో రుక్సానాను, ఆమె కుమారుడు ఫిరోజ్‌ను సల్మాన్ చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement
Advertisement