'పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాం'

31 Aug, 2015 18:35 IST|Sakshi

పాములపాడు (కర్నూలు) : కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో పవర్‌ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. మండలంలోని వేంపెంట గ్రామంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఆందోళనకు రఘువీరారెడ్డి సోమవారం మద్దతు తెలిపారు. ఆయన వేంపెంటలోని ప్రాజెక్టును సందర్శించి నిరసనకారులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

మరిన్ని వార్తలు