విజయవాడ కల్చరల్: బహుముఖ ప్రజ్ఞాశాలి, వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు అంత్యక్రియలు విజయవాడ స్వర్గపురి లోని క్రిమిటోరియంలో సోమవారం జరిగాయి. కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, పోలీసులు కలిసి బాలాంత్రపు భౌతికకాయానికి జాతీయ జెండా కప్పి వందనం సమర్పించారు. పోలీసు లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.
ఏపీ స్పెషల్ పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలో తుపాకులు పేల్చారు. అభిమానులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.