నీటితొట్టిలో పడి బాలుడి మృతి

13 Feb, 2015 18:15 IST|Sakshi

చిత్తూరు: ఓ నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సెల్లిగాని పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన భారతమ్మ, చంద్రప్పల చిన్న కుమారుడు మహేంద్ర(4). తల్లిదండ్రులు పొలం పనులకు వెళుతూ కుటుంబ సభ్యుల వద్ద మహేంద్రను ఉంచారు. అతడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందాడు.

(శాంతిపురం)

మరిన్ని వార్తలు