రెండు లారీలు ఢీ: క్లీనర్ మృతి

24 Jan, 2016 09:22 IST|Sakshi

గుంటూరు : గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ అడ్డురోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందారు. డ్రైవర్లు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు