పెనుకొండ రైల్వేగేటు వద్ద ట్రాఫిక్‌జామ్ | Sakshi
Sakshi News home page

పెనుకొండ రైల్వేగేటు వద్ద ట్రాఫిక్‌జామ్

Published Sun, Jan 24 2016 9:34 AM

traffic jam at the PENUKONDA railway gate

అనంతపురం జిల్లా పెనుకొండ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని రైల్వే గేటు వద్ద ఆదివారం ఉదయం ట్రాఫిక్ జామ్ నెలకొంది. రైల్వే గేటు మరమ్మతుల్లో ఉందని అప్పటికప్పుడు రైల్వే సిబ్బంది బోర్డు తగిలించి.. మరమ్మతు పనులు మొదలుపెట్టారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గేటు మూసివేయడంతో ఆర్టీసీ బస్సులతోపాటు ఇతరత్రా వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గేటు వద్ద వాహనాలను టర్న్ తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



 

Advertisement
Advertisement