గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌..

26 Jan, 2020 17:11 IST|Sakshi

సాక్షి, కృష్ణా: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు మచిలీపట్నంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ ఎఎండి ఇంతియాజ్‌ పాల్గొని​.. జాతీయి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మడ్‌ రిజర్వు పోలీసులు నిర్వహించిన ఉత్సవ కవాతు గౌవర వందనాన్ని కలెక్టర్‌ స్వీకరించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాపై సమగ్ర నివేదికను కలెక్టర్‌ ఇంతియాజ్‌ అందించారు. స్వతంత్ర సమరయోధులను కలెక్టర్‌ ఘనం సత్కరించారు. అదేవిధంగా  కార్యక్రమంలో పాల్గొన్న వారికి  ఇంతియాజ్‌​ గణతం‍త్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు