కుమార్తెను లైంగికంగా వేధించిన తండ్రి అరెస్టు

16 Mar, 2016 02:08 IST|Sakshi

పుంగనూరు: కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడి భార్య, కూతురి మరణానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు సీఐ చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం మంగళం కాలనీలోని హిదాయత్ నగర్ మార్కాపురానికి చెందిన జరీనా(28)ను పుంగనూరుకు చెందిన రహిమాన్ రెండవ వివాహం చేసుకున్నాడు. ఆరు సంవత్సరాల కిందట మార్కాపురం నుంచి హిదాయత్‌నగర్‌లో కాపురం పెట్టాడు. వీరికి నలుగురు పిల్లలు . అయిషా(13) , మహమ్మద్ (10), అంజుమ్(6) , నాగుర్ (8) ఉన్నా రు. వీరిలో మహమ్మద్, నాగుర్, అంజుమ్‌లు పుంగనూరు పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో చదువుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో చెడు దురలవాట్లకు బానిసైన రహిమాన్ రోజూ తప్పతాగి ఇంటికి వచ్చి కుమార్తె అయిషాను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయమై పలుమార్లు జరీనా ఘర్షణ పడినా రహిమాన్‌లో మార్పు రాలేదు. ఇలా ఉండగా వారం క్రితం భర్త చర్యలపై విరక్తి చెందిన జరీనా పిల్లలందరిపైన కిరోసిన్ పోసి నిప్పటించింది. ఈ సంఘటనలో జరీనా, అయిషా, అంజుమ్‌లు మృతి చెందా రు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రహిమాన్‌ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ హరిప్రసాద్ , సిబ్బంది పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు