'భూదందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ'

2 Mar, 2016 18:03 IST|Sakshi

విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూముల దురాక్రమణ కథనాలపై మాజీ ఐఏఎస్ శర్మ తీవ్రంగా స్పందించారు. రాజధాని భూముల ఆక్రమణ వ్యవహారంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కలామ్ కు తాను రాసిన లేఖ వివరాలను తెలిపారు. గత నెల 22వ తేదీన తాను ప్రభుత్వానికి రాసిన లేఖ, నేటి సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాల్లోని అంశాలు ఒకేలా ఉన్నాయని మాజీ ఐఏఎస్ వెల్లడించారు. సీఆర్డీఏకు సంబంధించిన ప్రతి జీవో బడా బాబులకు లాభం చేకూర్చేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని భూదందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తన లేఖలో పేర్కొన్నట్లు శర్మ వివరించారు.
 

మరిన్ని వార్తలు