ఆర్టీసీ బస్సులో మంటలు : తప్పిన ప్రమాదం

31 Jan, 2017 12:20 IST|Sakshi

విజయవాడ : కృష్ణాజిల్లాలో ఆర్టీసీ బస్సుకు మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కంచికచర‍్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపంతో ఇంజిన్‌ వద‍్ద మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దాగారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌ ఇంజిన్‌ను క్షుణ‍్ణంగా పరిశీలించాక బస్సు తిరిగి బయలుదేరింది.

మరిన్ని వార్తలు