వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులు

16 Nov, 2015 15:25 IST|Sakshi

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: అకాలవర్షాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలయ్యపల్లి మండలం గొల్లపల్లి సమీపంలో నేరాడ కాలువ పొంగిపొర్లడంతో వరద నీరు భారీగా రోడ్డుపైకి చేరింది.

దీంతో ఆ రహదారిలో వెళ్లుతున్న ఓ ఆటో వరదనీటిలో చిక్కుకుంది. అందులో ఓ పాపతో పాటు మరో నలుగురు భయంతో రక్షించమంటూ కేకలు పెట్టారు.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఆటోలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు