అనకాపల్లిటౌన్ : జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసిన 125 రూపాయల నాణెంను పట్టణానికి చెందిన కాండ్రేగుల హరికృష్ణ సొంతం చేసుకున్నారు. ఆంధ్రా బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ డిప్యూటీ జనరల్ కార్యదర్శి హరికృష్ణ గత ఏడాది సెప్టెంబర్ 27న డీడీ రూపంలో 3,450 రూపాయలు పంపించగా గురువారం ఆయనకు 125 రూపాయలు నాణెం అందజేశారు.