ఈయనుంటే.. స్వాతంత్ర్యం కూడా వచ్చేది కాదు

26 Jan, 2017 20:50 IST|Sakshi
ఈయనుంటే.. స్వాతంత్ర్యం కూడా వచ్చేది కాదు
చంద్రబాబు నాయుడి లాంటి నాయకుడు ఒక్కరుంటే.. మన దేశానికి స్వాతంత్ర్యం కూడా వచ్చి ఉండేది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తనను బలవంతంగా విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా, ప్రత్యేక హోదాకు ఆయన అడ్డు తగులుతున్న తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. జల్లికట్టు కోసం తమిళ ప్రజలు కలిసికట్టుగా ఉన్నతీరు తమకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే..