‘చంద్రబాబుది రాక్షస పాలన’

5 Aug, 2017 15:16 IST|Sakshi
‘చంద్రబాబుది రాక్షస పాలన’

పశ్చిమ గోదావరి: నంద్యాల సభ చూసి టీడీపీకి మైండ్ బ్లాక్ అయిందని వైఎస్ఆర్ సీపీ నేత కొట్టు సత్యనారాయణ అన్నారు. అందుకే టీడీపీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ పాలన స్వరణయుగం అని.. చంద్రబాబుది రాక్షస పాలన అని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఎన్నికుట్రలు చేసినా నంద్యాలలో వైఎస్ఆర్సీపీదే విజయమన్ని కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

నంద్యాల ఉప ఎన్నికలు ఆగస్టు 23వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ నంద్యాలలో  ఈ నెల మూడో తేదిన బహిరంగ సభ  నిర్వహించింది. ఈ సభ సక్సెస్ అవ్వటంతో అధికార టీడీపీ లో భయం పట్టుకుంది. నంద్యాల సభలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.
 

మరిన్ని వార్తలు